www.ntodaynews.com
కరెంట్ తీగలపై వేప చెట్టు: గుంటూరులో ప్రజల భయాందోళనలు
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గుంటూరులోని కాంచన టవర్స్ పక్కన ఉన్న ఎన్సీసీ అపార్ట్మెంట్ రోడ్డులో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న భారీ వేప చెట్టు విద్యుత్ తీగలపై వాలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ప్రత్యేకించి వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ తీగల వద్ద మంటలు కనిపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే చెట్టు కొమ్మలను తొలగించి భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఈ ఘటన గుంటూరు వెస్ట్ ప్రాంతంలో చోటుచేసుకోగా, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదం సంభవించే ముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.