BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

క్రిప్టో పేరుతో రూ.13 కోట్లు మోసపోయిన వైద్యుడు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 May, 2026 - 07:27 PM
151 వీక్షణలు

క్రిప్టో పేరుతో రూ.13 కోట్లు మోసపోయిన వైద్యుడు

గుంటూరుకు చెందిన ప్రముఖ ప్రైవేటు వైద్యుడు క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.13 కోట్లు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం, క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి సైబర్ నేరగాళ్లు వైద్యుడిని వలలో వేసుకున్నారు. మొదట చిన్న మొత్తాల్లో లాభాలు చూపిస్తూ నమ్మకం కలిగించారు. అనంతరం మరింత డబ్బు పెట్టాలని ప్రోత్సహించడంతో వైద్యుడు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది.

తనతో పాటు స్నేహితుల నుంచి సేకరించిన సొమ్మును కూడా ఈ పెట్టుబడుల్లో పెట్టినట్లు సమాచారం. కొంతకాలం పాటు ఆన్‌లైన్ ఖాతాలో లాభాలు కనిపించడంతో పెట్టుబడులు సురక్షితంగా ఉన్నాయనే భావించారు. అయితే డబ్బులు ఉపసంహరించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఖాతా నుంచి నగదు తీసుకోలేకపోయారు.

దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ అధికారులు లావాదేవీల వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల సమాచారాన్ని సేకరించి విచారణ కొనసాగిస్తున్నారు.

అధిక లాభాల ఆశతో తెలియని ఆన్‌లైన్ పెట్టుబడులపై నమ్మకం పెట్టుకోవద్దని, పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థల విశ్వసనీయతను నిర్ధారించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.