BREAKING
గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం
www.ntodaynews.com

క్రిప్టో పేరుతో రూ.13 కోట్లు మోసపోయిన వైద్యుడు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 May, 2026 - 07:27 PM
109 వీక్షణలు

క్రిప్టో పేరుతో రూ.13 కోట్లు మోసపోయిన వైద్యుడు

గుంటూరుకు చెందిన ప్రముఖ ప్రైవేటు వైద్యుడు క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.13 కోట్లు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం, క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి సైబర్ నేరగాళ్లు వైద్యుడిని వలలో వేసుకున్నారు. మొదట చిన్న మొత్తాల్లో లాభాలు చూపిస్తూ నమ్మకం కలిగించారు. అనంతరం మరింత డబ్బు పెట్టాలని ప్రోత్సహించడంతో వైద్యుడు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది.

తనతో పాటు స్నేహితుల నుంచి సేకరించిన సొమ్మును కూడా ఈ పెట్టుబడుల్లో పెట్టినట్లు సమాచారం. కొంతకాలం పాటు ఆన్‌లైన్ ఖాతాలో లాభాలు కనిపించడంతో పెట్టుబడులు సురక్షితంగా ఉన్నాయనే భావించారు. అయితే డబ్బులు ఉపసంహరించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఖాతా నుంచి నగదు తీసుకోలేకపోయారు.

దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ అధికారులు లావాదేవీల వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల సమాచారాన్ని సేకరించి విచారణ కొనసాగిస్తున్నారు.

అధిక లాభాల ఆశతో తెలియని ఆన్‌లైన్ పెట్టుబడులపై నమ్మకం పెట్టుకోవద్దని, పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థల విశ్వసనీయతను నిర్ధారించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.