BREAKING
చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ
www.ntodaynews.com

కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వకపోతే రైతు ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 06:30 PM
11 వీక్షణలు

నేడు ఏలూరు కలెక్టరేట్ ముట్టడికి పిలుపు

ఏలూరు, ఆగస్టు 2: కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని, లేకపోతే రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ డిమాండ్‌తో ఏలూరు శివారు సుంకరివారి తోట వంతెన వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో కృష్ణా డెల్టా రైతులు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కృష్ణా, గోదావరి నదుల్లో సమృద్ధిగా నీరు ఉండగా వరద జలాలు సముద్రంలో కలుస్తున్నప్పటికీ డెల్టాకు సాగునీరు విడుదల చేయకపోవడం రైతుల పట్ల అన్యాయమని విమర్శించారు. జూన్ 15 నుంచి నీరు విడుదల చేస్తామని చెప్పి రైతులతో నారుమళ్లు వేయించి, ఇప్పుడు వరి సాగు చేయవద్దని చెప్పడం ప్రభుత్వ వైఫల్యమన్నారు.

పట్టిసీమ, పులిచింతల ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఏలూరు మండలంలోని సుమారు 10 వేల ఎకరాలకు పొణంగి పుంత కాలువ ద్వారా గోదావరి జలాలు ఎందుకు అందించడం లేదని జలవనరుల శాఖను ప్రశ్నించారు. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెట్టుబడులు పెట్టి నారుమళ్లు, నాట్లు వేసినందున వెంటనే కృష్ణా తూర్పు కాలువకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన రైతు సంఘం, సోమవారం ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అవసరమైతే రోడ్ల దిగ్బంధనానికి కూడా సిద్ధమని రైతులు స్పష్టం చేశారు.