BREAKING
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి
www.ntodaynews.com

కృష్ణారావుపాలెం చెక్ పోస్ట్ వద్ద విజిబుల్ పోలీసింగ్ – ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jun, 2026 - 10:21 PM
38 వీక్షణలు

ఏలూరు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ దిశానిర్దేశనలతో, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో చాట్రాయి ఎస్.ఐ డి. రామకృష్ణ మరియు వారి సిబ్బంది కృష్ణారావుపాలెం చెక్ పోస్ట్ వద్ద విస్తృత విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.

చెక్ పోస్ట్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించడం, నేరాలను నిరోధించడం మరియు భద్రతా భావాన్ని పెంపొందించడం కోసం నిరంతర తనిఖీలు చేపట్టారు. వాహనదారులు అధిక వేగం, అజాగ్రత్త వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందని పోలీసులు సూచించారు.

ద్విచక్ర వాహనదారులు ప్రమాద సమయంలో ప్రాణాలను రక్షించుకోవడానికి నాణ్యమైన హెల్మెట్ ధరించాలి అని ప్రత్యేకంగా సూచించారు. అలాగే, ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించే ‘ప్రధాన మంత్రి రాహత్ పథకం’ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రమాద సమయంలో బాధితులకు సహాయం చేయడంలో వెనుకాడరాదు, ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనీ, ‘గుడ్ సమరిటన్’ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలను ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడడమే పోలీసుల లక్ష్యం అని, వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్.ఐ డి. రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.