www.ntodaynews.com
ఢిల్లీలో ఉద్రిక్తత.. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా
జాతీయం
ఢిల్లీలో ఉద్రిక్తత.. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో మంగళవారం రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. సీజేపీ మద్దతుదారులు పార్లమెంట్ ముట్టడికి యత్నించగా, కాంగ్రెస్ నేతలు ప్రధాని నివాసం వైపు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ఎంపీలు ప్రధాని నివాసం వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
ధర్నాలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భద్రతా బలగాలు భారీగా మోహరించాయి.