పోలవరం గ్రామ సమస్యలపై మంత్రి కొలుసు పార్థసారథితో యర్రా హేమంత్ కుమార్ భేటీ
పోలవరం గ్రామ సమస్యలపై మంత్రి కొలుసు పార్థసారథితో యర్రా హేమంత్ కుమార్ భేటీ
నూజివీడు డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి సంబంధించిన వివిధ సమస్యలపై గ్రామ సీనియర్ నాయకుడు యర్రా హేమంత్ కుమార్ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న తాగునీరు, సాగునీరు, మౌలిక వసతులు తదితర సమస్యలపై మంత్రితో చర్చించారు. ప్రస్తుతం రైతులు వేసిన వరి నారుమడులు ఎండిపోకుండా చెరువుల్లోని నీటిని అవసరానికి అనుగుణంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
అదేవిధంగా గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుంటూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి కృషి చేయాలని యర్రా హేమంత్ కుమార్కు మంత్రి సూచించారు.
గ్రామాభివృద్ధికి సంబంధించిన మరిన్ని అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.