యువతపై లాఠీఛార్జ్ను ఖండిస్తూ ప్రధాని నివాసం ఎదుట రాహుల్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ధర్నా
యువతపై లాఠీఛార్జ్ను ఖండిస్తూ ప్రధాని నివాసం ఎదుట రాహుల్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ధర్నా
న్యూఢిల్లీ: తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, యువతపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రధానమంత్రి నివాసం ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పాటు పలువురు నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. బలప్రయోగం ద్వారా యువత గొంతు నొక్కలేరని, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు