www.ntodaynews.com
బోగోలు–నరసన్నపాలెం రహదారికి ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
బోగోలు–నరసన్నపాలెం రహదారికి ప్రారంభోత్సవం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం, జూలై 21
ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రూ.1.15 కోట్ల వ్యయంతో నిర్మించిన బోగోలు–నరసన్నపాలెం సీసీ రహదారి, తారు రహదారులను చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తా పెదబాబు, గారపాటి బుజ్జయ్య, గరిమల చలపతి, ఇతర నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.