BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
www.ntodaynews.com

కెసిఆర్ మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చి 8 లక్షల కోట్లు అప్పు చేశాడు

తెలంగాణ
10 Jul, 2025 - 08:21 PM
250 వీక్షణలు
కెసిఆర్ మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చి 8 లక్షల కోట్లు అప్పు చేశాడు--భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. NTODAY NEWS: భువనగిరి పట్టణం భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి పట్టణంలో హెచ్ఎండిఏ నిధులు ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి గురువారం రోజున భువనగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చి 8 లక్షల కోట్ల అప్పు చేశాడు అని,తెచ్చిన అప్పును సక్రమంగా వినియోగించుంటే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేది అని అన్నారు గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ లకే పరిమితమైంది అని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 60000 ఉద్యోగాలు ఇచ్చాం అని గుర్తు చేశారు హరీష్ రావు, కేటీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రజలు,కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు బనకచర్ల బంకను మనకు రుద్దుదామని ప్రయత్నం చేస్తున్నారు అని, ఆరు నూరైనా బనకచర్ల ప్రాజెక్టును కానివ్వము కేటీఆర్ నువ్వు ఆఫ్రల్ ఎమ్మెల్యేవి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి నీది కాదు మీ నయనను చర్చకు సిద్ధం చెయ్యి అని అన్నారు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మొదటి అపెక్స్ కమిటీ లోనే మనకు రావలసిన నీళ్లపై కొట్లాడవలసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు అని అన్నారు కృష్ణాజిల్లాలో తెలంగాణకు రావలసిన 299 టీఎంసీలను 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఎప్పుడు వాడుకోలేదు అని గుర్తు చేశారు మేము అధికారంలోకి వచ్చిన తరువాత గత సంవత్సరము 280 టీఎంసీలను వాడుకున్నాము అని, కృష్ణా జలాల నది నదిపై కాంగ్రెస్ పార్టీ అయాములో ప్రాజెక్టులు ప్రారంభించారు కావున కమిషన్ రావని గోదావరిపై కాలేశ్వరం కట్టడానికి పూనుకున్నాడు అని అన్నారు కాలేశ్వరం ప్రాజెక్టు వలన ఉత్తర తెలంగాణకు తప్ప దక్షిణ తెలంగాణకు లాభం లేదు అని, కాంగ్రెస్ పార్టీ ఆయామ్ లో సగం పూర్తయిన ఎస్ఎల్బీసీ, రంగారెడ్డి టన్నెల్సు 6000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే లక్షల ఎకరాలు సాగునీరుకు అందుబాటులోకి వచ్చేది అని అన్నారు కేటీఆర్ నీవు ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి కాదు అని అన్నారు చాలెంజ్ చేయాలంటే ప్రతిపక్ష నాయకుడు అయిన కేసీఆర్ చేయాలి కానీ నువ్వు కాదు అని, నీకు దమ్ముంటే కేసీఆర్ దగ్గర నుంచి ప్రతిపక్ష హోదా తెచ్చుకొని చాలెంజ్ చేయి అని అన్నారు కెసిఆర్ రెండు లక్షల కోట్లు ఖర్చు చేసి గోదావరికి జలాలు 948 టీఎంసీలు కాపాడుకోలేకపోయాడు అని అన్నారు ఈ మీడియా సమావేశంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube