www.ntodaynews.com
కేసీఆర్ పాలనే మాకు శ్రీరామరక్ష
తెలంగాణ
కేసీఆర్ పాలనే మాకు శ్రీరామరక్ష: మహిళల మనోగతం
జగిత్యాలలో ఆత్మీయులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
NTODAY NEWS: జగిత్యాల, గొల్లపల్లి మండలం రిపోర్టర్
జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ శుక్రవారం జగిత్యాల పట్టణంలో పలువురు ఆత్మీయులను పరామర్శించారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో స్థానిక మహిళలతో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ పాలనపై మహిళల అసంతృప్తి
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మహిళలతో చర్చించిన సమయంలో ఆసక్తికరమైన అభిప్రాయాలు వెలువడ్డాయి. “ఏ ప్రభుత్వం బాగుంది?” అని వసంత సురేష్ ప్రశ్నించగా, మహిళలు ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పాలన బాగుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదని, ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో లోపాలు ఉన్నాయని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మళ్లీ కేసీఆర్ రావాలి
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, తమ కుటుంబాలు, జీవన పరిస్థితులు మెరుగుపడాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ పాలనలోనే ఆడబిడ్డలకు గౌరవం, భద్రత లభించాయని, అప్పటి ధైర్యం ఇప్పుడు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
#KCR
#BRSParty
#Jagtial
#WomenVoices
#TelanganaPolitics
#DavaVasanthaSuresh
#PublicOpinion
#PoliticalNews
#GrassrootsVoices
Follow us on
Website
Facebook
Instagram
YouTube