BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ఎండల దెబ్బకు ఆకాశాన్నంటిన ధరలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 05:42 AM
156 వీక్షణలు

లీటర్ కొబ్బరి నీళ్లకు ₹180.. ఎండల దెబ్బకు ఆకాశాన్నంటిన ధరలు

తీవ్ర ఎండల కారణంగా కొబ్బరి నీళ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో వ్యాపారులు ధరలను భారీగా పెంచారు. గతంలో ఒక్క బోండా రూపంలో అమ్మిన కొబ్బరి నీళ్లను ఇప్పుడు లీటర్ల రూపంలో విక్రయించడం ఎక్కువైంది. బెంగళూరులో లీటర్ కొబ్బరి నీళ్లకు ₹180 అంటూ బోర్డులు పెట్టిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా లీటర్ ధర ₹120 నుంచి ₹140 వరకు కొనసాగుతోంది. ఎండలు పెరగడంతో చల్లని పానీయాల కంటే సహజ పానీయాలవైపు ప్రజలు మొగ్గుచూపడం, సరఫరా కొంత తగ్గడం వంటి కారణాలతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్క బోండా ధర ₹60 నుంచి ₹100 వరకు ఉండగా, మంచి నీళ్లు వచ్చే బోండాలకు ఇంకా ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగితే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.