BREAKING
ఘనంగా టీపీటీఎఫ్ అడ్వైజర్ లింగయ్య జన్మదిన వేడుకలు మన పూర్వికులు ఇచ్చినటువంటి సాంప్రదాయాలను మనం మర్చిపోతూనే ఉన్నాము. ప్రతి నియోజకవర్గానికి సమాన అభివృద్ధి – సీఎం Revanth Reddy స్పష్టం కర్నూల్ మన ఊరు - మన జెండా కార్యక్రమం శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న నంద్యాల ఎంపీ చిట్యాల డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం 7న అమ్మవారికి కుంభోత్సవం నిరంతరం అక్రెడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ గౌరిగోపాల్ హాస్పిటల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలి ఘనంగా టీపీటీఎఫ్ అడ్వైజర్ లింగయ్య జన్మదిన వేడుకలు మన పూర్వికులు ఇచ్చినటువంటి సాంప్రదాయాలను మనం మర్చిపోతూనే ఉన్నాము. ప్రతి నియోజకవర్గానికి సమాన అభివృద్ధి – సీఎం Revanth Reddy స్పష్టం కర్నూల్ మన ఊరు - మన జెండా కార్యక్రమం శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న నంద్యాల ఎంపీ చిట్యాల డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం 7న అమ్మవారికి కుంభోత్సవం నిరంతరం అక్రెడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ గౌరిగోపాల్ హాస్పిటల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలి
www.ntodaynews.com

ఎండల దెబ్బకు ఆకాశాన్నంటిన ధరలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 05:42 AM
50 వీక్షణలు

లీటర్ కొబ్బరి నీళ్లకు ₹180.. ఎండల దెబ్బకు ఆకాశాన్నంటిన ధరలు

తీవ్ర ఎండల కారణంగా కొబ్బరి నీళ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో వ్యాపారులు ధరలను భారీగా పెంచారు. గతంలో ఒక్క బోండా రూపంలో అమ్మిన కొబ్బరి నీళ్లను ఇప్పుడు లీటర్ల రూపంలో విక్రయించడం ఎక్కువైంది. బెంగళూరులో లీటర్ కొబ్బరి నీళ్లకు ₹180 అంటూ బోర్డులు పెట్టిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా లీటర్ ధర ₹120 నుంచి ₹140 వరకు కొనసాగుతోంది. ఎండలు పెరగడంతో చల్లని పానీయాల కంటే సహజ పానీయాలవైపు ప్రజలు మొగ్గుచూపడం, సరఫరా కొంత తగ్గడం వంటి కారణాలతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్క బోండా ధర ₹60 నుంచి ₹100 వరకు ఉండగా, మంచి నీళ్లు వచ్చే బోండాలకు ఇంకా ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగితే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.