www.ntodaynews.com
లింగపాలెం మండలంలో పేకాట రైడ్ – 10 మంది అదుపులో
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలోని తాతగారు కాలనీలో పేకాట ఆడుతున్న స్థలంపై ధర్మాజీగూడెం పోలీసులు రైడ్ నిర్వహించారు.
ఈ దాడిలో మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రూ.10,200 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
అనధికారికంగా పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు చర్యలు తీసుకున్నట్లు ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.