లక్సెట్టిపేటలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
లక్సెట్టిపేటలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
లక్సెట్టిపేట, :మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ఉత్తూర్ చౌరస్తాలో పార్టీ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీని స్థాపించి, ఎన్నో పోరాటాల తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలను ఆదుకున్నాయని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు