www.ntodaynews.com
లక్సెట్టిపేటలో రోడ్డు ప్రమాదం: రైల్వే కానిస్టేబుల్కు గాయాలు
తెలంగాణ
లక్సెట్టిపేట: లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రైల్వే కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మంచిర్యాలలో రైల్వే కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడైన శ్రీనివాస్ను చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు