లక్షెట్టిపేట్ మండలంలో నూతన PACS పాలకవర్గాలకు ఆర్డర్ కాపీల అందజేత
లక్షెట్టిపేట్ మండలంలో నూతన PACS పాలకవర్గాలకు ఆర్డర్ కాపీల అందజేత
మంచిర్యాల నియోజకవర్గం..
మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు లక్షెట్టిపేట్ మండలానికి సంబంధించిన PACS నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లకు ఆర్డర్ కాపీలను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అందజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జెండా వెంకటాపూర్ PACS చైర్మన్ శ్రీ చెల్ల నాగభూషణ్ , వైస్ చైర్మన్ శ్రీ కేతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, అలాగే గుల్లకోట PACS చైర్మన్ శ్రీ పెయ్యాల దేవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ వొడ్డేపల్లి రాయలింగు మరియు నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లకు సురేఖమ్మ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన PACS పాలకవర్గాలు రైతుల సంక్షేమం, సహకార రంగం బలోపేతం కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. రైతులకు అవసరమైన సేవలు అందిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, మండల వైస్ ప్రెసిడెంట్ కందుల మోహన్, జిల్లా నాయకులు పూర్ణచంద్రరావు, మాజీ మండల అధ్యక్షులు పింగిలి రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొప్పు సుమన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.