BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

లక్ష్మీపురంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌కు భూమిపూజ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 04:25 PM
25 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్‌కు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భూమిపూజ నిర్వహించారు.

గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ క్లినిక్ నిర్మాణానికి రావి పద్మనాభ చౌదరి కుమారులు రావి వెంకట సత్యనారాయణ చౌదరి, రావి రామమోహన్ రావు 6.50 సెంట్ల స్థలాన్ని విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవల విస్తరణలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం స్థలాన్ని దానం చేసిన దాతలను అభినందిస్తూ, వారి సేవా భావం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో బొల్లినేని రాజా, నెక్కడపు శ్రీను, బాలమర్తి అప్పారావు, నాగరాజు, అప్పారావు తదితర నాయకులు, గ్రామ పెద్దలు, వైద్య శాఖ అధికారులు, పంచాయతీ అధికారులు, మహిళలు పాల్గొన్నారు.