BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 03 June 2026, 04:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లక్ష్మీపురంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌కు భూమిపూజ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 04:25 PM
127 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్‌కు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భూమిపూజ నిర్వహించారు.

గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ క్లినిక్ నిర్మాణానికి రావి పద్మనాభ చౌదరి కుమారులు రావి వెంకట సత్యనారాయణ చౌదరి, రావి రామమోహన్ రావు 6.50 సెంట్ల స్థలాన్ని విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవల విస్తరణలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం స్థలాన్ని దానం చేసిన దాతలను అభినందిస్తూ, వారి సేవా భావం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో బొల్లినేని రాజా, నెక్కడపు శ్రీను, బాలమర్తి అప్పారావు, నాగరాజు, అప్పారావు తదితర నాయకులు, గ్రామ పెద్దలు, వైద్య శాఖ అధికారులు, పంచాయతీ అధికారులు, మహిళలు పాల్గొన్నారు.