BREAKING
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక
www.ntodaynews.com

​లక్ష్శెట్టిపేటలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 01:49 PM
92 వీక్షణలు

ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య

​అర్జీలను ఓపికగా స్వీకరించి, పరిష్కరిస్తామన్న మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్

​లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 10, 13, 14, 15 వార్డులకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం స్థానిక ఐబీ గెస్టు హౌస్ లో ఘనంగా నిర్వహించబడింది. మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలు తమ సమస్యలు, అవసరాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, అధికారులు వాటిని ఓపికగా విని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేస్తే వాటి పరిష్కారానికి అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ దిలీప్ కుమార్, ఎస్ఐ సురేష్ లతో పాటు కౌన్సిలర్లు సత్యనారాయణ, పెండం పద్మ రాజు, మైలారం సుధాకర్, గోపతి సుజాత రమేష్ పాల్గొన్నారు. అలాగే కో-ఆప్షన్ సభ్యులు చింత సువర్ణ అశోక్ కుమార్, నక్క జాకబ్, థైసిన్ హజీ, ఆరిఫ్, కాంగ్రెస్ నాయకులు మరియు వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.