లోత్తునుర్ లో రంజాన్ తోఫా పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్
లోత్తునుర్ లో రంజాన్ తోఫా పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్: ముస్లిం సోదరులకు అండగా ప్రభుత్వం
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్నూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అద్దూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశానుసారం, గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గారి ఆధ్వర్యంలో ఈ తోఫాలను అందజేశారు.
రంజాన్ శుభాకాంక్షలు:
ఈ సందర్భంగా సర్పంచ్ ఆకుల సుమన్ గారు ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోందని, అందులో భాగంగానే ఈ పవిత్ర మాసంలో తోఫాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ముస్లిం సోదరుల కృతజ్ఞతలు:
తోఫా అందుకున్న ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తూ.. తమ సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి శ్రీ అద్దూరి లక్ష్మణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, దూదేకుల సాయిబ్ గారు, పలువురు ముస్లిం సోదరులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.