BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

మాపై దాడి చేసిన ఎస్.కె రమణ రెడ్డి పై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 04:45 PM
41 వీక్షణలు

అన్నమయ్య జిల్లా. పుంగనూరు ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడిన మాజీ బోయకొండ చైర్మన్ ఎస్. కె రమణారెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి...

నిజాయితీగా పనిచేసిన తమ మామ జెల్లీ మనోహర పై ఎస్.కె అక్రమ కోర్టు కేసులు వేశారన్న దీప..

పుంగనూరు పట్టణం లో గత రెండు రోజుల క్రితం మాపై ఎస్ కె రమణ రెడ్డి జై టౌన్ వద్ద కారు వద్ద వెళ్లిన తమపై దుర్భాషలాడి కారు డోర్ ను తోసి కిందకు పడేసారని దీప మీడియా కు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బోయకొండ మాజీ చైర్మన్ ఎస్.కె.రమణారెడ్డి వద్ద తమ మామ జల్లి మనోహర గత పది సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నారని,ఇటీవల తమ లావాదేవీలలో మనస్పర్ధలు రావడంతో తమ మామ మరియు తన భర్త చరణ్ లపై తప్పుడు కోర్టు కేసులు బనాయించారని, జె టౌన్ సమీపంలో తమ పిల్లలు పార్కులో ఆటలు ఆడుతుండగా అటుగా వచ్చిన ఎస్కే రమణారెడ్డి కారును చూసి తమ మామ కారే వచ్చిందని భావించి పిల్లలు కారు దగ్గరకు వెళ్లి చూడగా అందులో ఎస్కే రమణారెడ్డి ఉన్నారని, అయన ను అన్నా అని సంబోధిస్తూ పలకరించిన వెంటనే ఆయన దుర్భాషలాడి తమను కించపరిచే అసభ్య పదజాలం తో  మాట్లాడడం జరిగిందని,ఎందుకు ఆలా మాట్లాడుతున్నారు అన్న అని అడుగుతు తమ భర్త మరియు మామ పై అక్రమ కేసులు బనాయించి ఎందుకు చిత్రవాద చేస్తున్నారని ప్రాధేయపడుతూ మాట్లాడిన నన్ను మా అత్త మంజుల ఇద్దరిని అనరాని మాటలని కారు డోరును తోస్తూ కిందకి నెట్టివేయడం జరిగిందని,క్రింద పడి నా చేతికి కూడా గాయం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని,తన భర్తకు హైదరాబాదులో ఉద్యోగం ఉన్నందున ఇక్కడే స్థలమిప్పిస్తానని మాయ మాటలు చెప్పి తన భర్త బ్యాంకు లోన్ వేయించి దాదాపు 35 లక్షల రూపాయల తన అకౌంట్ కి వేయించుకొని ఇప్పటివరకు సమాధానం కూడా చెప్పడం లేదని వాపోయారు.దీనిపై ఒక మహిళగా వెంటనే పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు.