BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 03 June 2026, 09:22 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్!

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 09:22 AM
114 వీక్షణలు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం బట్టబయలైంది. మార్కాపురం పట్టణంలోని చౌక దుకాణం నెం.6లో భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు.

విశ్వసనీయ సమాచారం అందడంతో రెవిన్యూ అధికారులు ఆకస్మికంగా దుకాణంపై దాడులు నిర్వహించారు. తనిఖీల్లో మొత్తం 1922 కేజీల రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచినట్లు బయటపడింది.

అధికారుల విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సంబంధిత దుకాణంపై 6A కేసు నమోదు చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అంతేకాకుండా చౌక దుకాణాన్ని కూడా అధికారులు సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ఈ తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ సాలమ్మతో పాటు గ్రామ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.