BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్!

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 09:22 AM
52 వీక్షణలు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం బట్టబయలైంది. మార్కాపురం పట్టణంలోని చౌక దుకాణం నెం.6లో భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు.

విశ్వసనీయ సమాచారం అందడంతో రెవిన్యూ అధికారులు ఆకస్మికంగా దుకాణంపై దాడులు నిర్వహించారు. తనిఖీల్లో మొత్తం 1922 కేజీల రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచినట్లు బయటపడింది.

అధికారుల విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సంబంధిత దుకాణంపై 6A కేసు నమోదు చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అంతేకాకుండా చౌక దుకాణాన్ని కూడా అధికారులు సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ఈ తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ సాలమ్మతో పాటు గ్రామ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.