BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్!

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 09:22 AM
83 వీక్షణలు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం బట్టబయలైంది. మార్కాపురం పట్టణంలోని చౌక దుకాణం నెం.6లో భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు.

విశ్వసనీయ సమాచారం అందడంతో రెవిన్యూ అధికారులు ఆకస్మికంగా దుకాణంపై దాడులు నిర్వహించారు. తనిఖీల్లో మొత్తం 1922 కేజీల రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచినట్లు బయటపడింది.

అధికారుల విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సంబంధిత దుకాణంపై 6A కేసు నమోదు చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అంతేకాకుండా చౌక దుకాణాన్ని కూడా అధికారులు సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ఈ తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ సాలమ్మతో పాటు గ్రామ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.