BREAKING
మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో యువజన వారోత్సవాలు--యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్నేపల్లి ఘటనలో కిడ్నాప్ కోణం లేదన్న సీఐ రామారావు ​జాతీయ డెంగ్యూ దినోత్సవం: కలెక్టరేట్‌లో పోస్టర్ల ఆవిష్కరణ ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి రుతుపవనాల రాకపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ... చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో యువజన వారోత్సవాలు--యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్నేపల్లి ఘటనలో కిడ్నాప్ కోణం లేదన్న సీఐ రామారావు ​జాతీయ డెంగ్యూ దినోత్సవం: కలెక్టరేట్‌లో పోస్టర్ల ఆవిష్కరణ ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి రుతుపవనాల రాకపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ... చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం
www.ntodaynews.com

మే 17 నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కొద్ది రోజులు పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 07:21 PM
15 వీక్షణలు

హిందూ ధర్మశాస్త్రంలో అత్యంత పవిత్రంగా భావించే అధిక మాసం ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఇది అధిక జ్యేష్ఠ మాసంగా వస్తోంది. ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలను సాధారణంగా నిర్వహించరు. దీంతో కొద్ది రోజుల పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు విరామం లభించనుంది.

శాస్త్రాల ప్రకారం సౌరమానం, చాంద్రమానం మధ్య ఉండే రోజుల తేడాను సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి అదనంగా వచ్చే నెలనే అధిక మాసం అంటారు. ఏ చాంద్రమాసంలో సూర్య సంక్రమణం జరగదో ఆ మాసం అధిక మాసంగా నిర్ణయిస్తారు.

పురాణాల ప్రకారం ఈ మాసానికి శ్రీమహావిష్ణువు తన ‘పురుషోత్తమ’ నామాన్ని ప్రసాదించడంతో దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. అందుకే ఈ నెలలో విష్ణుమూర్తి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.

ఈ మాసంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు, గాయత్రీ మంత్ర జపం, నామస్మరణలు నిర్వహిస్తారు. అలాగే పండ్లు, పిండి వంటలు, స్వయంపాక దానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో దానధర్మాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది.

పండితుల సూచనల ప్రకారం అధిక మాసంలో లౌకిక శుభకార్యాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక చింతనకు ఎక్కువ సమయం కేటాయించడం మంచిదని చెబుతున్నారు.