BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

మే 17 నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కొద్ది రోజులు పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 07:21 PM
95 వీక్షణలు

హిందూ ధర్మశాస్త్రంలో అత్యంత పవిత్రంగా భావించే అధిక మాసం ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఇది అధిక జ్యేష్ఠ మాసంగా వస్తోంది. ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలను సాధారణంగా నిర్వహించరు. దీంతో కొద్ది రోజుల పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు విరామం లభించనుంది.

శాస్త్రాల ప్రకారం సౌరమానం, చాంద్రమానం మధ్య ఉండే రోజుల తేడాను సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి అదనంగా వచ్చే నెలనే అధిక మాసం అంటారు. ఏ చాంద్రమాసంలో సూర్య సంక్రమణం జరగదో ఆ మాసం అధిక మాసంగా నిర్ణయిస్తారు.

పురాణాల ప్రకారం ఈ మాసానికి శ్రీమహావిష్ణువు తన ‘పురుషోత్తమ’ నామాన్ని ప్రసాదించడంతో దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. అందుకే ఈ నెలలో విష్ణుమూర్తి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.

ఈ మాసంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు, గాయత్రీ మంత్ర జపం, నామస్మరణలు నిర్వహిస్తారు. అలాగే పండ్లు, పిండి వంటలు, స్వయంపాక దానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో దానధర్మాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది.

పండితుల సూచనల ప్రకారం అధిక మాసంలో లౌకిక శుభకార్యాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక చింతనకు ఎక్కువ సమయం కేటాయించడం మంచిదని చెబుతున్నారు.