www.ntodaynews.com
నిందితుడికి కఠిన శిక్ష విధించాలి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
మైనర్ బాలికపై అఘాయిత్యం – నిందితుడికి కఠిన శిక్ష విధించాలి
సిపిఐ నాయకుడు వెంకటరమణారెడ్డి డిమాండ్
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్య ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితుడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.
సోమవారం మాట్లాడుతూ, బాలికపై కిరాతకంగా దాడి చేసిన వ్యక్తిపై తక్షణ చర్యలు తీసుకుని, ఉదాహరణగా నిలిచేలా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితురాలి కుటుంబానికి అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి పాల్గొన్నారు.