BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై GDAAP తీవ్ర ఖండన

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
29 May, 2026 - 11:17 AM
408 వీక్షణలు

మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు వైద్య సిబ్బందిని సుమారు 10 గంటలపాటు నిర్బంధించి విచారించిన సంఘటనను గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (GDAAP) ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ యూనిట్ తీవ్రంగా ఖండించింది. 

ఈ సందర్భంగా GDAAP ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ యూనిట్ అధ్యక్షులు డా. కె. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిపై ఈ విధమైన వ్యవహారం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బందిని గంటల తరబడి నిర్బంధించి విచారించడం వల్ల ఆసుపత్రి సేవలకు అంతరాయం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వైద్య సిబ్బందికి తగిన గౌరవం, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డా. ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. వైద్య వృత్తిని గౌరవిస్తూ, వైద్య సిబ్బందికి అనుకూల వాతావరణం కల్పించడం అత్యంత అవసరమని GDAAP నాయకులు పేర్కొన్నారు.