BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 10 వేల జీతం చెల్లించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / చెన్నూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 Jun, 2026 - 07:16 PM
129 వీక్షణలు

పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు రూ. 20 పెంచాల

సీఐటీయు జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి. కరీంబి డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ. 10 వేల జీతం చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయు) జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి. కరీంబి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం రోజున చెన్నూరు ప్రెస్ క్లబ్ లో ముఖ్యనాయకుల సమావేశం జరిగింది.

​ఈ సందర్భంగా ఎండి. కరీంబి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్నం భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, వాటికి అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు ఇరవై రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే, విద్యార్థులకు అందించే కోడి గుడ్లను, వంట గ్యాస్ ను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. నిరుపేదలైన కార్మికులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు, ఐడి కార్డులు, యూనిఫామ్ లు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

​ఈ కార్యక్రమంలో సారక్క, పోసవ్వ, మేకల సారక్క తదితరులు పాల్గొన్నారు.