BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

​మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 10 వేల జీతం చెల్లించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / చెన్నూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 Jun, 2026 - 07:16 PM
62 వీక్షణలు

పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు రూ. 20 పెంచాల

సీఐటీయు జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి. కరీంబి డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ. 10 వేల జీతం చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయు) జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి. కరీంబి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం రోజున చెన్నూరు ప్రెస్ క్లబ్ లో ముఖ్యనాయకుల సమావేశం జరిగింది.

​ఈ సందర్భంగా ఎండి. కరీంబి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్నం భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, వాటికి అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు ఇరవై రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే, విద్యార్థులకు అందించే కోడి గుడ్లను, వంట గ్యాస్ ను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. నిరుపేదలైన కార్మికులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు, ఐడి కార్డులు, యూనిఫామ్ లు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

​ఈ కార్యక్రమంలో సారక్క, పోసవ్వ, మేకల సారక్క తదితరులు పాల్గొన్నారు.