BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​గడువులోగా కేజీబీవీ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 Jun, 2026 - 07:18 PM
150 వీక్షణలు

​నస్పూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన పాఠశాలను సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, నిర్మాణ సామగ్రి నాణ్యతలో గానీ, భద్రతలో గానీ ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పనులు చేపట్టాలన్నారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడుతూ.. వారికి అందుతున్న వసతులు, విద్యా సదుపాయాలు, భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యాభ్యాసంతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల కూడా శ్రద్ధ వహించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.

​అనంతరం పాఠశాలలోని హాజరు, అకడమిక్, ఇతర పరిపాలనా రికార్డులను పరిశీలించిన అదనపు కలెక్టర్.. ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి, వారి అభ్యాస స్థాయిలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో నాణ్యమైన బోధనతో పాటు పరిశుభ్రమైన వాతావరణం, క్రమశిక్షణ ఉండేలా చూడాలన్నారు. వంటగది, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి గదులను ఆయన తనిఖీ చేసి, విద్యార్థినుల సంక్షేమం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు, గుత్తేదారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు