BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

​గడువులోగా కేజీబీవీ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 Jun, 2026 - 07:18 PM
72 వీక్షణలు

​నస్పూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన పాఠశాలను సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, నిర్మాణ సామగ్రి నాణ్యతలో గానీ, భద్రతలో గానీ ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పనులు చేపట్టాలన్నారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడుతూ.. వారికి అందుతున్న వసతులు, విద్యా సదుపాయాలు, భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యాభ్యాసంతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల కూడా శ్రద్ధ వహించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.

​అనంతరం పాఠశాలలోని హాజరు, అకడమిక్, ఇతర పరిపాలనా రికార్డులను పరిశీలించిన అదనపు కలెక్టర్.. ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి, వారి అభ్యాస స్థాయిలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో నాణ్యమైన బోధనతో పాటు పరిశుభ్రమైన వాతావరణం, క్రమశిక్షణ ఉండేలా చూడాలన్నారు. వంటగది, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి గదులను ఆయన తనిఖీ చేసి, విద్యార్థినుల సంక్షేమం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు, గుత్తేదారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు