మధ్యాహ్నపువారి గూడెంలో పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు సంబరాలు
మధ్యాహ్నపువారిగూడెం హైవేపై గురువారం రాత్రి జరిగిన పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు అనుకోని విధంగా రాజకీయ “మాస్ ఫీస్ట్” ను తలపించాయి. మామూలుగా వున్న పుట్టినరోజు సంబరాలు కాదండీ, ఈ వేడుకకిది అసలు "లీ'పొలిటికల్ మాస్ ఫీస్ట్"!
ఎలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజున టీ. నరసాపురం మండలం ఎంతో అద్భుతంగా ముస్తాబైంది. ఒక సాధారణ పుట్టినరోజు వేడుక కాదని, పామాయిల్ గింజలు, కాయలు, పొగాకు ఆకులతో హైవేపై శుభాకాంక్షలు రాయడం, నింగిలో టపాసుల వెలుగులు ఒక కొత్తదనాన్ని కనబరిచాయి.
రైతులకు సహాయం అందిస్తున్న పుట్టా మహేష్ కుమార్ కు రైతుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, తోట లక్ష్మీనారాయణ నేతృత్వంలో తెలుగు తమ్ముళ్లు, యువత, మండల అధ్యక్షులు ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించారు.
అర్థరాత్రి వేళ టపాసులు దూసుకెళ్లే క్రమంలో, హైవే అంతా పండగ వాతావరణంతో నిండిపోయింది. కేక్ కట్ చేసిన అనంతరం తోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, "పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు మాకు పండగ రోజు, ఆయన నాయకత్వంలో మండలంలో అభివృద్ధి సాధించబడుతోంది," అని వ్యాఖ్యానించారు.
ఈ వేడుకకు తెలుగు యువత, కేడర్, అభిమానులు భారీ స్థాయిలో పాల్గొని, "జై మహేష్ కుమార్! జై టీడీపీ!" అంటూ నినాదాలు చేశారు.