BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

మెదక్ జిల్లాలో ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ ఏడీఈ అరెస్ట్

తెలంగాణ
/ మేడక్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 04:49 PM
58 వీక్షణలు

మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో ఆపరేషన్స్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ముద్దం రమణారెడ్డి ఏసీబీ వలలో చిక్కుకున్నారు.

2026 మే 22న మధ్యాహ్నం సుమారు 12:40 గంటలకు తన కార్యాలయంలో ఫిర్యాదిదారుడి నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదిదారుడికి సంబంధించిన రూ.3,13,882 విలువైన 11 వర్క్ బిల్లులను మెదక్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ డివిజనల్ ఇంజనీర్‌కు పంపించేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

దాడిలో ఏఓ వద్ద నుంచి కలుషితమైన రూ.25 వేల లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ విధులను నిజాయితీగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు లంచం స్వీకరించినట్లు ఏసీబీ నిర్ధారించింది.

అనంతరం ముద్దం రమణారెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని SPE & ACB ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ పేర్కొంది.