మెదక్ జిల్లాలో ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ ఏడీఈ అరెస్ట్
మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో ఆపరేషన్స్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ముద్దం రమణారెడ్డి ఏసీబీ వలలో చిక్కుకున్నారు.
2026 మే 22న మధ్యాహ్నం సుమారు 12:40 గంటలకు తన కార్యాలయంలో ఫిర్యాదిదారుడి నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫిర్యాదిదారుడికి సంబంధించిన రూ.3,13,882 విలువైన 11 వర్క్ బిల్లులను మెదక్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ డివిజనల్ ఇంజనీర్కు పంపించేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
దాడిలో ఏఓ వద్ద నుంచి కలుషితమైన రూ.25 వేల లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ విధులను నిజాయితీగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు లంచం స్వీకరించినట్లు ఏసీబీ నిర్ధారించింది.
అనంతరం ముద్దం రమణారెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్లోని SPE & ACB ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ పేర్కొంది.