BREAKING
కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే
www.ntodaynews.com

మీ కోసంలో 52 ఫిర్యాదులు.. బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 09:03 PM
21 వీక్షణలు

మీ కోసంలో 52 ఫిర్యాదులు.. బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశాలు

మచిలీపట్నం: కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక "మీ కోసం" కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన బాధితులు తమ అర్జీలను సమర్పించగా, మొత్తం 52 ఫిర్యాదులు నమోదయ్యాయి.

ఫిర్యాదుల్లో చల్లపల్లి ప్రాంతానికి చెందిన వృద్ధురాలు నర్సమ్మ తన కుమారులు తనను పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. పెనమలూరుకు చెందిన దిలీప్ తన స్నేహితుడికి అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మచిలీపట్నానికి చెందిన విద్య అనే వివాహిత తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను, తన పిల్లలను మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును చట్టపరంగా, నిష్పక్షపాతంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

ఈ సందర్భంగా ప్రజలకు ఎస్పీ సూచిస్తూ, సమస్యల పరిష్కారం కోసం జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న "మీ కోసం" కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కేవలం జిల్లా పోలీసు కార్యాలయంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదులు సమర్పించవచ్చని తెలిపారు.