BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

మీడియా ముసుగులో బూతులు సిగ్గుచేటు.

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 07:22 PM
96 వీక్షణలు

మీడియా ముసుగులో బూతులు సిగ్గుచేటు. బూతు కిట్టు అనేది రాధాకృష్ణకి సరైందే.మహిళల గురించి తప్పుడు కూతలు సరైందేనా?.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల భార్యల గురించి అసభ్యంగా ఏబిఎన్ ఛానల్ ప్రసారం చేసిన కధనం మహిళల పట్ల ఏబిఎన్ రాధాకృష్ణకి ఎంత చులకన భావం ఉందో అర్థం అవుతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి చాట్ల రాబర్ట్ అన్నారు. మీడియా ముసుగులో, అధికార పార్టీ అండదండలతో ఏబిఎన్ ఛానల్ లో నీచాతి నీచమైన కథలు, కధనాలు ప్రసారం చేసి రాష్ట్రంలో అలజడులు సృష్టించే కధనాలను ఖండిచ వలసిన అధికార పార్టీ నేతలు బూతుల రాధాకృష్ణను సమర్దించటం సిగ్గు చేటు అన్నారు. మహిళలను చులకనగా మాట్లాడితే సహించేది లేదని పదేపదే నారా లోకేష్ అంటున్నారు కదా మరి ఏబిఎన్ కధనం లో మహిళల గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. గతంలో సాక్షి లో వచ్చిన ప్రసారంలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు  ప్రమేయం లేకుండానే ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటలకు కూటమి ప్రభుత్వం కొమ్మినేని ని అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు కదా అప్పుడు ఉన్న ఉత్సాహం కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు లేదా? పచ్చమీడియా ఎన్ని పచ్చి బూతులు ప్రసారం చేసినా సమర్దించటం తెలుగు తమ్ముళ్ళ కి సరైందేనా? అని ప్రశ్నించారు. మహిళలపై చులకనగా కధనాలు ప్రసారం చేసే ఏబిఎన్ రాధాకృష్ణ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.