మెగా డి ఎస్సి పై వైసిపి పోరాటం లో భాగంగా టౌన్ హల్ సమావేశం..
మెగా డి ఎస్సి పై వైసిపి పోరాటం లో భాగంగా టౌన్ హల్ సమావేశం..
అన్నమయ్య జిల్లా,
పుంగనూరు.
పుంగనూరు వైసిపి నాయకులు జె.ఎం.డి ఫంక్షన్ హల్ నందు నేడు
మెగా డి ఎస్సి పై వైసిపి పోరాటం లో భాగంగా టౌన్ హల్ సమావేశం నిర్వహించారు.రాష్ట్రం లో నిర్వహించిన మెగా డీ ఎస్సి మళ్ళీ నిర్వహించాలని,నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేరవేర్చడం లో నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.
చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతు టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం విఫలం ఐయ్యిందని,నిరుద్యోగులకు, విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ మోసం చేస్తున్నారన్నారు.
పుంగనూరు నియోజకవర్గం పరిశీలకులు జింక చలపతి మాట్లాడుతు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఏస్సి అక్రమాల పై వైసిపి ప్రభుత్వం చేపట్టిన ఫీజు రీంబర్స్మెంట్ లపై పోరాటం లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6,7,8 తేదీలలో అన్ని నియోజకవర్గ సెంటర్ ల పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందని, 10వ తారీఖు న పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా పాల్గొననున్నరని ఆయన తెలిపారు.
వైసిపి టౌన్ హల్ సమావేశం లో పుంగనూరు నియోజకవర్గం వైసిపి నాయకులు మాజీ ఎంపీపీ. భాస్కర్ రెడ్డి,షరీఫ్,మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, అమ్ము,రాజశేఖర్ రెడ్డి, ఇర్ఫాన్,అస్లాం మురాదీ,విద్యార్థులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.