www.ntodaynews.com
మెగా పేరెంట్–టీచర్ సమావేశానికి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్కు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
మెగా పేరెంట్–టీచర్ సమావేశానికి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్కు ఆహ్వానం
ఈ నెల 24వ తేదీన చింతలపూడి మండలం ప్రగడవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్కు జిల్లా విద్యాశాఖ ప్రతినిధులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఏఎల్ఎస్సీఓ నాగేశ్వరావు, ఐఈసీఓ భాస్కర్, ఏఎస్వో రామకృష్ణ ఎమ్మెల్యేను కలిసి కార్యక్రమ విశేషాలను వివరించి, సమావేశానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.