BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

మహబూబాబాద్ మార్కెట్‌కు తాళం.. రైతుల ఆందోళన

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:06 PM
27 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో రైతుల నుంచి ఎన్.ఎస్. ట్రేడర్స్ కొనుగోలు చేసిన మిర్చి, మొక్కజొన్న పంటలకు సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. "మా డబ్బులు మాకు ఇప్పించాలి" అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. ఎన్.ఎస్. ట్రేడర్స్ మార్కెట్ యార్డులోనే కాకుండా మార్కెట్ వెలుపల కూడా రైతుల నుంచి మిర్చి, మొక్కజొన్న కొనుగోలు చేసి మూడు నెలలు గడిచినా ఇప్పటికీ చెల్లింపులు చేయలేదన్నారు. రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ తమను తిప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయడానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.