BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మహిళా మహిళల జోలికి వస్తే బూడిదైపోతావ్ వేలంపల్లి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
09 Apr, 2026 - 02:27 PM
82 వీక్షణలు
మహిళా మహిళల జోలికి వస్తే బూడిదైపోతావ్ వేలంపల్లి
విజయవాడ 

09-04-2026


రాధాకృష్ణ ఒక 'యెల్లో వైరస్' - వెలంపల్లి

మహిళల జోలికొస్తే బూడిదవుతావు - వెలంపల్లి

పత్రికా రంగం పేరుతో బ్రోకర్ రాజకీయాలు చేస్తూ,మహిళా లోకాన్ని కించపరుస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్,మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు.రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు,రాధాకృష్ణ బరితెగింపుపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెలంపల్లి అనంతరం మీడియాతో మాట్లాడుతూ అత్యంత కరుకుగా స్పందించారు.​"రాధాకృష్ణ ఒక పత్రికా యజమాని కాదు, నైతిక విలువలు లేని ఒక వికృత మనస్తత్వవాది.చంద్రబాబు చంకలో కూర్చుని,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలపై విషం కక్కడం రాధాకృష్ణకు నిత్యకృత్యమైంది.మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వార్తలు రాస్తున్న రాధాకృష్ణకు ఇంట్లో ఆడవాళ్లు లేరా? అని ప్రశ్నిస్తున్నాం.పత్రికా స్వేచ్ఛ అనేది నీ ఇంటి సొత్తు కాదు.నీవు రాసే రాతలు,చేసే కూతలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి.రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని మహిళల గౌరవంతో ఆడుకుంటే సహించేది లేదు,"అని వెలంపల్లి హెచ్చరించారు.​రాధాకృష్ణ లాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని,ఇటువంటి 'నీచ బుద్ధి' ఉన్న వ్యక్తిని వెంటనే కటకటాల వెనక్కి నెట్టాలని ఆయన డిమాండ్ చేశారు."రాధాకృష్ణా నీ అరాచకాలను ఇకపై సాగనివ్వం. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను వీధి వీధినా తరిమి కొడతారు.పోలీసులు తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేసి రాధాకృష్ణను అరెస్ట్ చేయాలి.చట్టం తన పని తాను చేయకపోతే,మహిళా లోకం తిరగబడి బుద్ధి చెబుతుంది,"అని అత్యంత ఘాటుగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వెలంపల్లి   మాజి మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు పాల్గొన్నా రు.