BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
18 Aug, 2026 - 02:02 PM
15 వీక్షణలు

మహిళలు, బాలల భద్రతే ప్రధాన లక్ష్యం: ఆమడగూరు ఎస్‌ఐ గోపాలకృష్ణ

ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు

ఆమడగూరు: మహిళలు, బాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమడగూరు ఎస్‌ఐ గోపాలకృష్ణ తెలిపారు.

మహిళలు, బాలలపై జరుగుతున్న నేరాల నివారణ, వారి హక్కులు, చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో కందుకూరుపల్లిలో సోమవారం మహిళల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, పుట్టపర్తి డీఎస్పీ సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, బాలలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.

ఎస్‌ఐ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు, బాలలపై జరుగుతున్న నేరాలు, వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, POCSO చట్టం, మహిళలు మరియు బాలలకు సంబంధించిన వివిధ చట్టాలు, ఆత్మహత్యల నివారణ తదితర అంశాలను వివరించారు.

మహిళలు, బాలలు ఎలాంటి వేధింపులు, నేరాలు లేదా ఆన్‌లైన్ మోసాలకు గురైనప్పటికీ భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. సమస్యను పోలీసుల దృష్టికి తీసుకువచ్చి చట్టపరమైన సహాయం పొందాలని తెలిపారు.

మహిళలు, బాలల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్‌ఐ గోపాలకృష్ణ అన్నారు. నేరాల నివారణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.