మిల్లెట్ పన్నీర్ తయారీ, ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం
హనుమకొండ గోపాల్పూర్లో యూనిట్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
హనుమకొండ | Ntoday News
హనుమకొండ జిల్లా గోపాల్పూర్ జవహర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మిల్లెట్ పన్నీర్ తయారీ, ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభమైంది. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ ప్రోత్సాహంతో యువ పారిశ్రామికవేత్త ఉజ్వల చంద్రగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పన్నీర్ తయారీ, ప్రాసెసింగ్ యూనిట్ను జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా యూనిట్లో మిల్లెట్ ఆధారిత పన్నీర్ తయారీ, ప్రాసెసింగ్కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. మిల్లెట్లతో విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా యువతలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ ప్రోత్సాహంతో యువ పారిశ్రామికవేత్త ఉజ్వల చంద్రగిరి ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం లభించనుంది.