BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మిట్టల్‌కు వరాలు.. విశాఖ ఉక్కుకు నిర్లక్ష్యం?

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 10:49 PM
86 వీక్షణలు

మిట్టల్‌కు వరాలు.. విశాఖ ఉక్కుకు నిర్లక్ష్యం? – వైఎస్ షర్మిల ఫైర్

అమరావతి, మార్చి 25: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న మిట్టల్ స్టీల్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం చూపుతున్న ప్రోత్సాహం, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పట్ల అవలంబిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రభుత్వం మీద ఘాటు ఆరోపణలు చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు భారీగా రాయితీలు, సబ్సిడీలు అందిస్తున్నారని, సుమారు రూ.25 వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు ప్రకటించడం, రాష్ట్ర వాటా జీఎస్టీపై 15 సంవత్సరాల మినహాయింపులు ఇవ్వడం, విద్యుత్ చార్జీలలో యూనిట్‌కు రూ.1 వరకు సబ్సిడీ కల్పించడం వంటి నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.

అదే సమయంలో బైలడిల్లా నుంచి ఐరన్ ఓర్ కేటాయింపులు, రవాణా సదుపాయాలు, సొంత పోర్ట్, పైప్‌లైన్ అనుమతులు వంటి కీలక సౌకర్యాలను కూడా మిట్టల్ ప్రాజెక్ట్‌కు అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడిసరుకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇక విశాఖ ఉక్కు కర్మాగారానికి నీరు, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాల్లో సరైన మద్దతు లభించడం లేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రైవేట్ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

దాదాపు 35 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది.