మల్లేలలో ఇంటింటికి కరపత్రాల పంపిణీతో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజల్లోకి
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు మండలం మల్లెల గ్రామంలోని 134, 135 పోలింగ్ బూత్ల పరిధిలో కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో ఆదివారం ఇంటింటికి కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య పాల్గొని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రభుత్వ పనితీరును తెలియజేసి ప్రజలతో మమేకమయ్యారు.
కార్యక్రమంలో తిరువూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దుబ్బాకు వెంకటేశ్వరావు, క్లస్టర్ ఇన్చార్జి తేలాప్రోలు మోహనరావు, పరిశీలకుడు గడిపర్తి హనుమంతరావు, 134 బూత్ కన్వీనర్, పీఏసీఎస్ చైర్మన్ బుడ్డి జగన్, 135 బూత్ కన్వీనర్ దొడ్డా మాధవరావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు జి. గోవర్ధన్, మద్దినేని రామారావు, మట్టూరి మురళి, కిరణ్, వంగురి శ్రీను, జానుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.