www.ntodaynews.com
తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి
తెలంగాణ
/
మంచిర్యాల
/
తాండూర్
మంచీర్యాల: తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి
మంచీర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి బోర్డు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లికి చెందిన రెడ్డివేణి సాంబమూర్తి (40) దుర్మరణం పాలయ్యారు. వృత్తిరీత్యా తాండూరు వచ్చిన ఆయన పని ముగించుకుని ఆటోలో తిరిగి వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సాంబమూర్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే తన భర్త మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని మృతుడి భార్య రాజమణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు