www.ntodaynews.com
ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుందరసాలకు చెందిన హరికృష్ణ (28) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉపాధి కోసం హైదరాబాద్లో కారు కొని అద్దెకు ఇచ్చిన హరికృష్ణకు, ఆ వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో మానసిక వేదనకు గురై ఈ నెల 7న ఒక లాడ్జీలో పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు స్వయంగా తెలియజేయడంతో వారు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ బుధవారం అతను మరణించాడు. 15 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయి, ఇప్పుడు చేతికందిన కొడుకు కూడా దూరం కావడంతో తల్లి రమ కన్నీరుమున్నీరవుతున్న తీరు అందరినీ కలిచివేస్తోంది.