www.ntodaynews.com
ఐబీ చౌరస్తాలో పునఃప్రారంభమైన ట్రాఫిక్ సిగ్నల్స్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
ఐబీ చౌరస్తాలో పునఃప్రారంభమైన ట్రాఫిక్ సిగ్నల్స్
మంచిర్యాల: పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే ఐబీ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ శనివారం నుండి పునఃప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా కూడలి సుందరీకరణ పనుల కారణంగా సిగ్నల్ వ్యవస్థ నిలిచిపోవడంతో వాహనాల నియంత్రణ కష్టంగా మారి, నిత్యం ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సిగ్నల్స్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సాఫీగా జరుగుతుందని, ప్రమాదాల భయం తగ్గిందని హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, ఇకనైనా ప్రయాణం సురక్షితంగా మారుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు