BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

ఎన్నికల హామీ మేరకు బోర్ ఏర్పాటు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
30 Apr, 2026 - 11:56 AM
15 వీక్షణలు

​మంచిర్యాల: ‘ఎన్నికల హామీ మేరకు బోర్ ఏర్పాటు

మంచిర్యాల, ఏప్రిల్ 30: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల పట్టణంలోని 12వ డివిజన్‌లో ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోరు బావిని గురువారం ఘనంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా రఘునాథ్ రావు మాట్లాడుతూ, పట్టణానికి చేరువలోనే గోదావరి నది ప్రవహిస్తున్నప్పటికీ, స్థానిక ప్రజలు తీవ్రమైన తాగునీటి సమస్యను ఎదుర్కోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో ఈ ప్రాంత పర్యటనలో భాగంగా ఇక్కడి ప్రజల నీటి కష్టాలను చూసి, తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చానని ఆయన గుర్తు చేశారు.

​ప్రజలకు ఇచ్చిన మాట మేరకు, ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా సొంత ఖర్చుతో ఈ బోరు బావిని ఏర్పాటు చేశామన్నారు. తాము కేవలం ఎన్నికల రాజకీయాలు చేయమని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు