BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

ఎన్నికల హామీ మేరకు బోర్ ఏర్పాటు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
30 Apr, 2026 - 11:56 AM
7 వీక్షణలు

​మంచిర్యాల: ‘ఎన్నికల హామీ మేరకు బోర్ ఏర్పాటు

మంచిర్యాల, ఏప్రిల్ 30: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల పట్టణంలోని 12వ డివిజన్‌లో ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోరు బావిని గురువారం ఘనంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా రఘునాథ్ రావు మాట్లాడుతూ, పట్టణానికి చేరువలోనే గోదావరి నది ప్రవహిస్తున్నప్పటికీ, స్థానిక ప్రజలు తీవ్రమైన తాగునీటి సమస్యను ఎదుర్కోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో ఈ ప్రాంత పర్యటనలో భాగంగా ఇక్కడి ప్రజల నీటి కష్టాలను చూసి, తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చానని ఆయన గుర్తు చేశారు.

​ప్రజలకు ఇచ్చిన మాట మేరకు, ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా సొంత ఖర్చుతో ఈ బోరు బావిని ఏర్పాటు చేశామన్నారు. తాము కేవలం ఎన్నికల రాజకీయాలు చేయమని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు