www.ntodaynews.com
గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్
మంచిర్యాల (MNCL): భీమారంలో కాంగ్రెస్ శ్రేణుల దాడిలో గాయపడి, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్త గోపాల్ను మాజీ ప్రభుత్వ విప్, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సోమవారం పరామర్శించారు.
ఆదివారం రాత్రి జరిగిన ఈ దాడిలో గాయపడ్డ గోపాల్ ఆరోగ్య పరిస్థితిని సుమన్ అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులతో కలిసి ఆసుపత్రికి వచ్చిన ఆయన, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అనంతరం దాడి జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకుని, కార్యకర్తకు ధైర్యం చెప్పారు