www.ntodaynews.com
మంచిర్యాల జిల్లా కొత్త ఎమ్మార్వోగా ఎండి ఖాదర్ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
కరీంనగర్ జిల్లా నుండి బదిలీపై వచ్చిన శ్రీ ఎండి ఖాదర్ మంచిర్యాల జిల్లా నూతన తహశీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సౌలభ్యమే ధ్యేయంగా, సుమారు లక్ష మంది ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన రెవెన్యూ సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తి చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని, ప్రజలతో నిరంతరం సమీప సంబంధాలు ఏర్పాటు చేసుకొని వారి సమస్యలను సమర్థవంతంగా, సకాలంలో పరిష్కరించడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు