BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 53వ డివిజన్‌లో ముమ్మరంగా ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ వార్డు సభ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 01:50 PM
245 వీక్షణలు

ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరడమే లక్ష్యం: మేయర్ దర్ని మధుకర్

​సమస్యల పరిష్కారానికి అధికారుల సమీక్ష

​మంచిర్యాల, జూన్ 10: ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలందరికీ చేరవేయడమే లక్ష్యంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్‌లో బుధవారం వార్డు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు అధికారులను ఈ సభలో అందుబాటులో ఉంచామని, డివిజన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే డివిజన్ పరిధిలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, శాంతిభద్రతలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

​ఈ వార్డు సభా కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నూర్జహాన్ బేగం, మంచిర్యాల ఎస్సై (SI) మజారుద్దీన్, అలాగే విద్యుత్, వ్యవసాయ, గృహ నిర్మాణ (హౌసింగ్ బోర్డు) శాఖల అధికారులు, డివిజన్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ పరిధిలోని పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు