BREAKING
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక
www.ntodaynews.com

​మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 53వ డివిజన్‌లో ముమ్మరంగా ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ వార్డు సభ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 01:50 PM
112 వీక్షణలు

ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరడమే లక్ష్యం: మేయర్ దర్ని మధుకర్

​సమస్యల పరిష్కారానికి అధికారుల సమీక్ష

​మంచిర్యాల, జూన్ 10: ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలందరికీ చేరవేయడమే లక్ష్యంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్‌లో బుధవారం వార్డు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు అధికారులను ఈ సభలో అందుబాటులో ఉంచామని, డివిజన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే డివిజన్ పరిధిలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, శాంతిభద్రతలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

​ఈ వార్డు సభా కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నూర్జహాన్ బేగం, మంచిర్యాల ఎస్సై (SI) మజారుద్దీన్, అలాగే విద్యుత్, వ్యవసాయ, గృహ నిర్మాణ (హౌసింగ్ బోర్డు) శాఖల అధికారులు, డివిజన్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ పరిధిలోని పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు