www.ntodaynews.com
ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
తెలంగాణ
/
మంచిర్యాల
మంచిర్యాల: ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
మంచిర్యాల :విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్వి (BRSV) జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు నిలిచిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బకాయిలను చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం పట్ల "సవతి తల్లి ప్రేమ" చూపిస్తోందని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సరికాదని ఆయన తీవ్రంగా విమర్శించారు