www.ntodaynews.com
మంచిర్యాల రంజాన్ వేడుకల్లో రాజకీయ చిచ్చు
తెలంగాణ
/
తెలంగాణ
/
మంచిర్యాల
మంచిర్యాల రంజాన్ వేడుకల్లో రాజకీయ చిచ్చు
మంచిర్యాలలోని ఆండాళమ్మ కాలనీ ఈద్గా వద్ద జరిగిన పవిత్ర రంజాన్ వేడుకలు రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. వేడుకలకు హాజరైన రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించే క్రమంలో కొందరు ముస్లిం పెద్దలు వ్యవహరించిన తీరుపై మరో వర్గం ముస్లింలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యేకు ఇచ్చిన ప్రాధాన్యతను మాజీ ఎమ్మెల్యేకు ఎందుకు ఇవ్వలేదని వారు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. పవిత్రమైన పండుగను ఇలా రాజకీయ వేదికగా మార్చడం పట్ల ముస్లిం సమాజంలోని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు