మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు
మంచిర్యాల పట్టణంలో బక్రీద్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో, అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అండాలమ్మ కాలనీ ఈద్గా మరియు బస్ స్టాండ్ కబ్రస్థాన్ దర్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్మి మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు (కార్పొరేటర్) తూముల నరేష్లతో పాటు పలువురు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ ధర్మి మధుకర్ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ శాంతి, సహనానికి ప్రతీక అని, అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలని కోరారు. తూముల నరేష్ మాట్లాడుతూ.. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు ముస్లిం సోదరులతో కలిసి పండుగ వాతావరణంలో పాలుపంచుకోవడం పట్టణంలో నెలకొన్న మత సామరస్య వాతావరణాన్ని ప్రతిబింబించింది