BREAKING
​ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలి వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఏఈవో బలవన్మరణం ​టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు ​ఆఖరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి గడ్డం వివేకానంద ​ఐకేపీ, వీఓఏల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సంపూర్ణ మద్దతు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన మహానాడు రెండో రోజు కార్యక్రమానికి చనుబండ నుంచి భారీగా తరలిన టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటి వీరేష్. స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి ​ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలి వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఏఈవో బలవన్మరణం ​టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు ​ఆఖరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి గడ్డం వివేకానంద ​ఐకేపీ, వీఓఏల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సంపూర్ణ మద్దతు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన మహానాడు రెండో రోజు కార్యక్రమానికి చనుబండ నుంచి భారీగా తరలిన టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటి వీరేష్. స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి
www.ntodaynews.com

​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 May, 2026 - 06:43 PM
40 వీక్షణలు

మంచిర్యాల పట్టణంలో బక్రీద్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో, అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అండాలమ్మ కాలనీ ఈద్గా మరియు బస్ స్టాండ్ కబ్రస్థాన్ దర్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్మి మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు (కార్పొరేటర్) తూముల నరేష్‌లతో పాటు పలువురు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ ధర్మి మధుకర్ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ శాంతి, సహనానికి ప్రతీక అని, అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలని కోరారు. తూముల నరేష్ మాట్లాడుతూ.. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు ముస్లిం సోదరులతో కలిసి పండుగ వాతావరణంలో పాలుపంచుకోవడం పట్టణంలో నెలకొన్న మత సామరస్య వాతావరణాన్ని ప్రతిబింబించింది