www.ntodaynews.com
మంచిర్యాలలో మంత్రుల పర్యటన
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాలలో మంత్రుల పర్యటన: ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే, కలెక్టర్
మంచిర్యాల పట్టణంలో శుక్రవారం రాజకీయ సందడి నెలకొంది. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేకానందలతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టణానికి చేరుకున్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన వీరికి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఘనస్వాగతం పలికారు.
మంత్రులకు మర్యాదపూర్వకంగా మొక్కలను అందజేసి, సాదరంగా ఆహ్వానించారు. ఈ పర్యటన నేపథ్యంలో పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు