BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

మంచిర్యాలలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం అవగాహన కార్యక్రమాలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
18 May, 2026 - 05:36 PM
16 వీక్షణలు

మంచిర్యాల జిల్లాలో ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రజలకు రక్తపోటుపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు రెవెన్యూ డివిజన్ మంచిర్యాల్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రక్తపోటుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్.సి.డి డాక్టర్ ప్రసాద్, వైద్యాధికారులు డాక్టర్ స్నేహిత, డాక్టర్ అశోక్ కలిసి రక్తపోటుపై అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన అధికారులకు, ప్రజలకు రక్తపోటు లక్షణాలు, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.

రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రక్తపోటును “నిశ్శబ్ద శత్రువు”గా అభివర్ణించారు. ముందస్తుగా గుర్తించి జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చని తెలిపారు. సరైన సమయంలో, సరైన మోతాదులో మందులు వాడటం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓలు కాకిరాల వెంకటేశ్వర్లు, ఆర్.ఎస్. పద్మ, వసుమతి, మార్త లక్ష్మణ స్వామి, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సింగ్ అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గ్రామాలలో ప్రజలకు రక్తపోటుపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా అధికారులకు, ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తపోటుకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు