BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

మంచిర్యాలలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం అవగాహన కార్యక్రమాలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 May, 2026 - 05:36 PM
58 వీక్షణలు

మంచిర్యాల జిల్లాలో ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రజలకు రక్తపోటుపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు రెవెన్యూ డివిజన్ మంచిర్యాల్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రక్తపోటుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్.సి.డి డాక్టర్ ప్రసాద్, వైద్యాధికారులు డాక్టర్ స్నేహిత, డాక్టర్ అశోక్ కలిసి రక్తపోటుపై అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన అధికారులకు, ప్రజలకు రక్తపోటు లక్షణాలు, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.

రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రక్తపోటును “నిశ్శబ్ద శత్రువు”గా అభివర్ణించారు. ముందస్తుగా గుర్తించి జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చని తెలిపారు. సరైన సమయంలో, సరైన మోతాదులో మందులు వాడటం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓలు కాకిరాల వెంకటేశ్వర్లు, ఆర్.ఎస్. పద్మ, వసుమతి, మార్త లక్ష్మణ స్వామి, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సింగ్ అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గ్రామాలలో ప్రజలకు రక్తపోటుపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా అధికారులకు, ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తపోటుకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు