BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

మంచిర్యాలలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం అవగాహన కార్యక్రమాలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 May, 2026 - 05:36 PM
98 వీక్షణలు

మంచిర్యాల జిల్లాలో ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రజలకు రక్తపోటుపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు రెవెన్యూ డివిజన్ మంచిర్యాల్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రక్తపోటుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్.సి.డి డాక్టర్ ప్రసాద్, వైద్యాధికారులు డాక్టర్ స్నేహిత, డాక్టర్ అశోక్ కలిసి రక్తపోటుపై అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన అధికారులకు, ప్రజలకు రక్తపోటు లక్షణాలు, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.

రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రక్తపోటును “నిశ్శబ్ద శత్రువు”గా అభివర్ణించారు. ముందస్తుగా గుర్తించి జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చని తెలిపారు. సరైన సమయంలో, సరైన మోతాదులో మందులు వాడటం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓలు కాకిరాల వెంకటేశ్వర్లు, ఆర్.ఎస్. పద్మ, వసుమతి, మార్త లక్ష్మణ స్వామి, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సింగ్ అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గ్రామాలలో ప్రజలకు రక్తపోటుపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా అధికారులకు, ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తపోటుకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు