మంచిర్యాలలో ఉచిత అంబలి పంపిణీ ప్రారంభం
మంచిర్యాలలో ఉచిత అంబలి పంపిణీ ప్రారంభం
కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
కేంద్రాలను ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
మంచిర్యాల నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కీ.శే. శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ముందడుగు వేసింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాలను మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రారంభించారు.
బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలీవాడ, సిసిసి కార్నర్ మరియు శ్రీరాంపూర్ కాలనీ వంటి జనసమ్మర్థం గల ప్రాంతాలలో ఈ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడే సామాన్యులకు, బాటసారులకు ఈ అంబలి ఎంతో మేలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, పలువురు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు